మొదటి తరం రాయలసీమ కథలు పేరుతో ఒక కొత్త పుస్తకాన్ని అతి త్వరలో ప్రచురిస్తున్నామని తెలిపేందుకు సంతోషిస్తున్నాము. జనవినోదిని, హిందూసుందరి, సౌందర్యవల్లి, శారద, శ్రీసాధనపత్రిక, తెనుగుతల్లి, విజయవాణి, చిత్రగుప్త మొదలైన పత్రికలనుండి సేకరించిన 42 కథలు ఈ సంకలనంలో ఉంటాయి. ఈ కథలన్నీ క్రీ.శ.1882 - 1944ల మధ్య ప్రకటించబడ్డాయి. ఈ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడెమీ యువపురస్కార గ్రహీత అప్పిరెడ్డి హరినాథరెడ్డి సంపాదకుడు. ఈ పుస్తకంలో కథలతో పాటు కథాలక్షణాలను వివరించే ఒక వ్యాసం 1927 జనవరి 15వ తేదీ శ్రీ సాధనపత్రికనుండి సేకరించినది అనుబంధంగా ఇస్తున్నాము. హెచ్.నంజుండరావు వ్రాసిన ఈ వ్యాసం చాలా విలువైనదని చదివిన వాళ్ళందరూ అంగీకరిస్తారు. ఇంకా ఈ పుస్తకానికి కేతు విశ్వనాథరెడ్డి, సింగమనేని నారాయణలు వ్రాసిన పీఠికలుంటాయి. సరే సంపాదకుని ముందుమాట, ప్రచురణకర్త (అంటే నేను వ్రాసిన ) నోటు ఎలాగూ ఉంటాయి. ఈ పుస్తకం వెల 200/-. బహుశా మే నెల చివరి వారంలో వెలువడనున్న ఈ పుస్తకాన్ని నేడే రిజర్వు చేసుకోండి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి