...

...

22, నవంబర్ 2013, శుక్రవారం

కథాకుటుంబం


అంతర్జాల కథావేదిక కథాజగత్‌లో కథకుల సంబంధ బాంధవ్యాలను పరికిస్తే ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తున్నాయి. ఒకే కుటుంబం నుండి ఎక్కువగా నలుగురు రచయితలు [తండ్రి(శ్రీరాగి), కొడుకు(వియోగి), కోడలు(విశాల వియోగి), కూతురు(రమ్య)] కథాజగత్‌లో స్థానం పదిలపరచుకోగా తరువాతి స్థానాన్ని నంబూరి పరిపూర్ణ(తల్లి), దాసరి శిరీష(కూతురు), దాసరి అమరేంద్రల(కొడుకు) కుటుంబం దక్కించుకుంది. ఇప్పటివరకూ 13 జంటలు(భార్యాభర్తలు)* కథాజగత్ రచయితలు కాగా తల్లి-కూతురు, తండ్రి-కూతురు, మామ-అల్లుడు, పిన్ని- అక్క కొడుకుల కాంబినేషన్ కూడా ఈ కథాజగత్‌లో చూడవచ్చు. మునుముందు ఇంకా ఎక్కువమంది బంధుగణాన్ని కథాజగత్‌లో చూడబోతున్నారు.     

కామెంట్‌లు లేవు: