...

...

9, ఆగస్టు 2013, శుక్రవారం

సాహిత్య సమాచారం!

పద్య కవి మిత్రుల ఉపయోగార్థం...




నేటి నిజం దినపత్రిక సౌజన్యంతో

రంజని - విశ్వనాథ
పద్య కవితా పోటీలు: 2013


2013 సంవత్సరానికి మొత్తం అవార్డు సొమ్ము 5,000 రూపాయలు

ప్రథమ బహుమతి : 2000 రూ.ల నగదు + యోగ్యతా పత్రం
ద్వితీయ బహుమతి : 1500 రూ.ల నగదు + యోగ్యతా పత్రం
మూడు ప్రత్యేక బహుమతులు :1500 రూ.ల నగదు + యోగ్యతా పత్రాలు (500X3)

నిబంధనలు: 
* ఏ ఛందస్సులోనయినా ఒక అంశం మీదే 12 పద్యాలకు తక్కువ కాకుండా ఉండాలి.
*సామాజికత తప్పనిసరి
*ఇంతవరకూ ప్రచురణ, ప్రసారం కానివి, దేనికీ అనువాదం, అనుక(స)రణ కాని పద్య కవితల్ని మాత్ర్మే పంపాలి.
*ఇందుకు సంబంధించిన హామీ పత్రాన్ని విధిగా జతపరచాలి.
*పద్యకవితల్ని కాగితంపై ఒక వైపే రాయాలి.
*పద్యకవితలు పంపే కవరుపై 'రంజని-విశ్వనాథ పద్య కవితా పోటీలు' అని పేర్కొనాలి.
*పద్యకవిత ఉన్న కాగితంపై పేరు, విలాసం ఏదీ రాయకూడదు.
*పూర్తిపేరు, చిరునామా తదితర వివరాలు హామీ పత్రంలో మాత్రమే పేర్కొనాలి.
*విజేతలకు ఫలితాలను నేరుగాను, పత్రికాముఖంగాను తెలియచేస్తారు.
*ఎంపికయిన పద్యకవితలను ప్రచురించే హక్కు రంజనిదే.
*న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం.

ప్రధాన కార్యదర్శి, రంజని, తెలుగు సాహితీ సమితి, ఏ.జి.ఆఫీసు, హైదరాబాదు 500 004 అనే చిరునామాకు 10-09-2013 లోగా అందేలా పంపాలి.

కామెంట్‌లు లేవు: