...

...

17, జూన్ 2013, సోమవారం

ఆవిష్కరణ సభ విశేషాలు!

'స్పందన' అనంతకవుల వేదిక ఆధ్వర్యంలో అనంతపురం ఎన్.జీ.వో.హోమ్‌లో నిన్న అంటే 16 జూన్ 2013 తేదీ 'జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు' గ్రంథావిష్కరణ సభ జరిగింది. తైలసాంకేతిక పరిశోధనాసంస్థ పూర్వ సంచాలకులు శ్రీ అజీముద్దీన్ గ్రంథావిష్కరణ గావించారు. స్పందన అధ్యక్షులు శ్రీ టి.రాజారామ్ సభకు అధ్యక్షత వహించారు. శ్రీ రమేష్ నారాయణ, శ్రీ సింగమనేని నారాయణ పుస్తకాన్ని సభకు పరిచయం చేశారు. ఇంకా శ్రీయుతులు చంధ్రశేఖర శాస్త్రి, ఏలూరి యంగన్న, బండి నారాయణ స్వామి, జయసుమన్ తదితరులు సర్దేశాయి తిరుమలరావుగారితో తమ అనుబంధాన్ని వివరించారు. సంపాదకుల తరఫున డా.నాగసూరి వేణుగోపాల్ తమ స్పందనను తెలియజేశారు. ఈ సభకు అనంతపురంలోని ప్రముఖ సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు, తిరుమలరావుగారితో పరిచయం ఉన్నవారూ పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో శ్రీయుతులు కైపనాగరాజ, ఆర్.శేషశాస్త్రి, గొల్లాపిన్ని శేషాచలం, శాంతినారాయణ, ఉద్దండం చంద్రశేఖర్, అంకే శ్రీనివాస్, మధురశ్రీ,ఆకుల రఘురామయ్య, అమళ్లదిన్నె వెంకటరమణప్రసాద్, జి.రామకృష్ణ, ఎన్.బి.ఎల్.ప్రసాద్, ఓ.ఎస్.రామచంద్రయ్య ప్రభృతులు ఉన్నారు. 'బ్లాగాడిస్తా' రవి ఈ సభకు హాజరు కావడం ఒక విశేషం. ఈ సభ తాలూకు ఫోటోలు, పత్రికలలో వచ్చిన వార్తాంశాలు ఇక్కడ చూడవచ్చు. 













ఆంధ్రజ్యోతి

ఈనాడు

ఆంధ్రభూమి

కామెంట్‌లు లేవు: