...

...

7, జనవరి 2013, సోమవారం

శ్రీనుగాడి తత్వమీమాంస!


    మెడకాయ వంకరగా పెట్టి కాసేపు దీర్ఘంగా ఆలోచించి ""అలా భగవంతుని వెలుగులో మనమూ ఒక వెలుగై కలిసిపోతే ఏమిటమ్మా లాభం?" అడిగాడు శ్రీను.

    "లాభమని చిన్నగా అంటావేమిట్రా? ఎన్నెన్నో జన్మలెత్తుతూ రోగాలు రొష్టులూ, దరిద్రమూ దుఃఖాలతో బ్రతకాల్సిన అవస్థ వుండదు గదా!"

    "అమ్మా! నాకైతే ఎల్లకాలం అలా వెలుగులో వెలుగై ఉండాలని లేదే! మళ్లీ మళ్లీ పుట్టాలనిపిస్తుంది. మన గేదె ఈనినప్పుడు నువ్వొండిపెట్టే జున్నులాంటి జున్నూ, కొత్త అటుకులూ, జొన్న ఊచ బియ్యం, తంపటేసిన పచ్చేరు శనక్కాయలూ మళ్లీ మళ్లీ తింటూ వుండకపోతే ఎలాగే! అసలు మామిడి పళ్లు తింటూ ఉండకపోతే ఎలా? ప్రొద్దున్నే మన ఊరు చెరువులో రంగురంగుల తామర్లనీ - దాని చుట్టూ చెట్లకి వెళ్లాడే గిజిగాళ్లని చూస్తుండకపోతే ఇంకేం బ్రతుకు?"

    "ఓరి సన్యాసి! అసలు బ్రతుకే వద్దని, బ్రహ్మలో ఐక్యమైపోవాలని గదరా భక్తులు పాటుపడేది!"

    "అదేనమ్మా! అలా కుదర్దు నాకు. ఎప్పుడూ బ్రతికుంటూ మాయాబజార్, మల్లీశ్వరి లాంటి సినిమాలు లెక్కలేనన్ని సార్లు చూస్తుండాలి. బస్సుల్లో, రైళ్లలో, మోటార్ సైకిల్ మీద ఝామ్మంటూ తిరుగుతుండాలి. పెద్దాణ్ణయి మన దేశమంతా తిరిగి రావాలి. మళ్లీ జన్మలోనైనా అమెరికా, ఇంగ్లాండ్ చూసిరావాలి. ఇవన్నీ ఏం లేకుండా ఏమిటో వెలుగులో వెలుగై కూర్చుంటే ఏం జరుగుతుందిటా?"

    "ఒరే శ్రీనుగా! ఎప్పుడైనా నీతో వాదించి గెలవగలిగానేట్రా? లోకమంతా కాచి వడబోసిన ముసలాళ్లా మాట్లాడతావయ్యే!" లోలోపల కొడుకు తెలివికి మురిసిపోతూ అంది తిరువెంగళమ్మ.

   నంబూరి పరిపూర్ణ గారి ఈకథ కథాజగత్‌లో పూర్తిగా చదవండి.  

కామెంట్‌లు లేవు: