...

...

5, మార్చి 2012, సోమవారం

విజయవంతంగా జరిగిన ఆవిష్కరణ సభ!

సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం మరియు కేంద్రసాహిత్య అకాడమీ వారి మోనోగ్రాఫు విద్వాన్ విశ్వం పుస్తకాల ఆవిష్కరణ సభ చాలా వైభవంగా జరిగింది. 

వయోధిక పాత్రికేయ సంఘం మరియు అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఈ సభకు డా.జి.యస్.వరదాచారి అధ్యక్షత వహించారు. సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం పుస్తకాన్ని డా.కె.వి.రమణాచారి ఆవిష్కరించగా ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ తొలి ప్రతిని స్వీకరించారు. అనంతరం విద్వాన్ విశ్వం మోనోగ్రాఫును ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి ఆవిష్కరించగా తొలి ప్రతిని డా.జి.ఎస్.వరదాచారి గారు స్వీకరించారు. అనంతరం ఈ పుస్తకాలను టి.ఉడయవర్లు, ఆచార్య పి.సుమతీనరేంద్రగారలు వరుసగా సభకు పరిచయం చేశారు.

డా.కె.వి.రమణాచారి, కె.శ్రీనివాస్, డా.కేతు విశ్వనాథరెడ్డిగార్లు సభలో ప్రసంగించారు. 

సంపాదకుల తరఫున డా.నాగసూరి వేణుగోపాల్ తమ స్పందనను తెలియజేశారు. నా విన్నపాన్ని మన్నించి సభకు హాజరైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 

కామెంట్‌లు లేవు: