...

...

18, మార్చి 2011, శుక్రవారం

మెదడుకు మేత!- 5

పరమానందయ్య ఒక ప్రొఫెషనల్ రచయిత. ఆయన ఆంధ్రాజమీను దిన పత్రికలో వ్రాసిన రచనల వివరాలు ఇలా ఉన్నాయి.

జనవరి నెల : 1 కథ, 1 వ్యాసం, 1కవిత

ఫిబ్రవరి నెల : 1కథ, 5 వ్యాసాలు, 7కవితలు


మార్చి నెల : 1కథ, 7వ్యాసాలు, 10 కవితలు

ఏప్రిల్ నెల: 9కథలు, 23 వ్యాసాలు, 30 కవితలు.

ఆ పత్రిక వాళ్లు ఒక్కో ప్రక్రియకు నిర్దుష్టమైన పారితోషికం ఇస్తారు. పరమానందయ్యకు ఫిబ్రవరి నెలలో 3000రూపాయలు, మార్చి నెలలో 3900 రూపాయలు పారితోషికం వచ్చింది. అయితే జనవరి, ఏప్రిల్ నెలల్లో ఎంత పారితోషికం వస్తుంది?  

కామెంట్‌లు లేవు: