...

...

9, మార్చి 2011, బుధవారం

మెదడుకు మేత! - 3

తెలుగు భాషలో పరిపూర్ణమైన నిఘంటువు లేదని భావించిన ఆచార్య తవ్వా నరహరిగారు నిఘంటు నిర్మాణానికి పూనుకున్నారు. నిఘంటు నిర్మాణం ఆషామాషీ వ్యవహారం కాదు. దానికి కఠోరమైన పరిశ్రమ, అకుంఠిత దీక్ష, నిర్దుష్టత, శ్రద్ధగా పరిశీలించే జాగరూకత మొదలైనవన్నీ అవసరమైనప్పటికీ దానిని ఒక సవాలుగా స్వీకరించి ఆ పనికి శ్రీకారం చుట్టారు. నాలుగేళ్ళు శ్రమించిన తరువాత ఒక బృహత్ నిఘంటువును నరహరి కోశం పేరుతో వెలువరించారు. దీనిలో పది లక్షలకు పైగా పదాలు, వాటి అర్థవివరణాదులు ఉన్నాయి.

మాదిరాజు సీతారాం గారి 'మాదిరాజు శబ్దమంజూష'లో కన్నా ఈ నరహరి కోశంలో 62,623 పదాలు అధికంగా ఉన్నాయి.మాదిరాజు శబ్దమంజూషలో తొమ్మిది లక్షలకు పైగా పదాలు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మాదిరాజు శబ్దమంజూషలోని పదాలసంఖ్యలో నాలుగు అంకె లేదు. మరియు ఏ అంకె కూడా పునరావృత్తం కాలేదు.

మాదిరాజు శబ్దమంజూషలోని పదాలసంఖ్యకు అయిదువందలా యిరవై రెండు కలుపగా వచ్చిన సంఖ్య యొక్క వర్గమూలాన్ని ద్విగుణీకరించి ఆరు కలిపితే ఆ నిఘంటువు పుటల సంఖ్య వస్తుంది.

పై సమాచారం ఆధారంగా నరహరికోశంలోని పదాల సంఖ్యను, మాదిరాజు శబ్దమంజరిలోని పుటల సంఖ్యను కనుక్కోగలరా?      

కామెంట్‌లు లేవు: