...

...

25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

కథను వ్రాయండి!

తెలుగుకథలకు అంతర్జాలంలో ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న కథాజగత్ మీ రచనా సామర్థ్యాన్ని పరీక్షించే చర్యకు పూనుకొంటున్నది. దీన్ని ఒక సవాలుగా తీసుకుని ఈ క్రింది నియమాలను పాటిస్తూ ఒక చక్కని కథను వ్రాసి పంపండి.

1. మొదటగా మీరు చేయాల్సింది శ్రీ పి.వి.బి.శ్రీరామమూర్తి గారి కథ పరిధి దాటిన వేళ చదవండి.

2.ఈ కథలో రచయిత వర్ధనమ్మ అనే పాత్ర పరంగా కథను నడిపించారు కదా. మీరు చేయాల్సిందల్లా ఇదే ఇతివృత్తాన్ని తీసుకుని వర్ధనమ్మ భర్త దృష్టితో ఆలోచించి ఆ కోణంలో కథను మీదైన శైలిలో తిరగవ్రాయండి.

3. మీకథను యూనికోడ్‌లో వ్రాసి mmkodihalli@gmail.com కు 12 మార్చి 2011 లోగా మెయిల్ చేయాలి.

4. గడువులోగా వచ్చిన కథలలో బాగా నచ్చిన కథ(ల)ను ఎంచుకుని కథాజగత్ లేదా తురుపుముక్కలో ప్రచురిస్తాము.

5. కథాజగత్ లేదా తురుపుముక్కలో మీ కథను ప్రకటించడమే మేము ఇవ్వబోయే గొప్ప బహుమతి.

6. కథ(ల) ఎంపికలో తుది నిర్ణయం మాదే.

7. మీరు పంపబోయే కథలను మీమీ బ్లాగుల్లో కానీ లేదా ఎక్కడైనా పత్రికల్లో గానీ నిరభ్యంతరంగా ప్రచురించుకోవచ్చు. అయితే ఫలితాలు ప్రకటించే వరకూ ప్రచురించకుండా ఉంటే బాగుంటుంది. 

ఇంకెందుకు ఆలస్యం? మీ బుఱ్ఱకు పని పెట్టండి.         

కామెంట్‌లు లేవు: